క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో – డా. సుమంత్ కుమార్
నిజామాబాద్, జూన్ 20: ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉందని, ప్రతి రోగికి ఒకే విధమైన చికిత్స అవసరం ఉండదని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆన్కాలజిస్ట్, హెమటాలజీ స్పెషలిస్ట్ డా. సుమంత్ కుమార్ మల్లుపట్టు తెలిపారు.
శుక్రవారం నిజామాబాద్ పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోగి ఆరోగ్య పరిస్థితి, క్యాన్సర్ రకం, దశలను బట్టి చికిత్స విధానాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. చికిత్స యొక్క ప్రధాన లక్ష్యాలు క్యాన్సర్ను పూర్తిగా నియంత్రించడం లేదా తగ్గించడం, రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడం, అలాగే చికిత్స వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడం అని పేర్కొన్నారు.
ఆధునిక వైద్య సాంకేతికతతో అవసరమైన చికిత్సను అందిస్తూ, సైడ్ ఎఫెక్ట్స్ను కనిష్ట స్థాయికి పరిమితం చేయగలుగుతున్నామని తెలిపారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక రేడియేషన్ థెరపీ యంత్రం ‘హైపర్సైట్’ (HyperSight) వినియోగంలో ఉందని, ఈ సాంకేతికత ద్వారా మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించడం సాధ్యమవుతోందన్నారు.
రేడియేషన్ చికిత్స ప్రత్యేకతలు
రేడియేషన్ చికిత్సలో క్యాన్సర్ ప్రభావిత భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం వల్ల చుట్టుపక్కల ఉన్న సాధారణ కణజాలానికి నష్టం తక్కువగా ఉంటుందని డా. సుమంత్ కుమార్ వివరించారు. చికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో (ప్రెసిషన్) అందించగలగడం ఈ విధానంలోని ప్రధాన ప్రత్యేకత అని తెలిపారు.
అలాగే ప్రతి నెల మూడవ శుక్రవారం నిజామాబాద్లోని యశోద మెడికల్ సెంటర్లో అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.























