ధర్పల్లి లో చలివేద్రం ప్రారంభం
గురువారం : 09/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో నూతన బస్టాండ్ ఆవరణ లోశ్రీమణికంఠ మినరల్ వాటర్ ప్లాంట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ను ధర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ మెల్ల శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది.
ధర్పల్లి బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులకు మరియు చుట్టుపక్కల ప్రజలకు వేసవి ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మినరల్ వాటర్ ని అందిచాలనే ఉద్దేశంలో ప్రతి సంవత్సరం లాగే ఈ వేసవిలో కూడా చలివేద్రం ప్రారంభింస్తునట్లు నిర్వాహకులు *సబ్బని గిరిధర్* తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ధర్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీ చెలిమెల శ్రీనివాస్ విచ్చేసి చలివేంద్రం ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం అని సర్పంచ్ మరియు గ్రామ సెక్రటరీ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో చిలుక రాజేశ్వర్, వెంగళ లింబాద్రి , చాట్ల ప్రణీత్, వెంగల సందీప్, కరోబార్ సమెంధర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

























