హోన్నాజీపేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ చిన్న బాల్రాజ్
బుధవారం : 15/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ప్రారంభించారు. సందర్భంగా చిన్న బాల్ రాజ్ మాట్లాడుతూ వరి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2389, బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర2369 ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, సర్పంచ్ మద్దికుంట ఆశావా బాబాన్న, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, విష్ణు, లత, పద్మ లత తదితరులు ఉన్నారు























