విజేతలకు నగదు రివార్డులు అందజేసిన డిజిపి బి .శివధర్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 23: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు.రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ‘సెంట్రల్ ఫ్లాగ్ ఫండ్’ నుంచి నగదు పురస్కారాలను అందజేశారు. ప్రథమ విజేతలకు రూ. 20,000, ద్వితీయ విజేతలకు రూ. 15,000, తృతీయ విజేతలకు రూ. 10,000 చొప్పున బహుమతులు ఖరారు చేశారు. విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేటగిరీ-1 (పీసీ నుంచి ఏఎస్ఐ వరకు):
‘పని ప్రదేశాల్లో లింగ వివక్ష’ అనే అంశంపై నిర్వహించిన ఈ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్కు చెందిన ధసరి ప్రశాంత్, కావేరి దీపిక ప్రథమ బహుమతులు సాధించారు. కరీంనగర్ పీటీసీకి చెందిన కె. రవికుమార్, ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్కు చెందిన ఎ. రాజు ద్వితీయ బహుమతులు… కరీంనగర్ జిల్లా చొప్పదండి పీఎస్కు చెందిన పి. స్వర్ణలత, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎ. శ్రీలత తృతీయ బహుమతులు గ

























