డయల్ 100 / 112 యందు సిబ్బందికి మేలుకువలు నేర్పించిన పోలీస్ కమిషనర్
హైదరాబాదు నుండి వచ్చిన సాంకేతిక నిపుణులతో శిక్షణా కార్యక్రమం నిర్వహణ పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100 / 112 వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు మరియు అందులో ఎదురవుతున్న లోపాలను అధిగమించేందుకు *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పి.ఎస్.,* ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలోభాగంగా హైదరాబాద్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా కమిషనరేట్ పరిధిలో ని ఎస్. ఐ లకు సీఐ లకు, డయల్ 100 / 112 సిబ్బందికి కీలక సూచనలు మరియు శిక్షణ ఇప్పించారు.
*ఈ శిక్షణ మరియు మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు:*
🔷త్వరితగతిన స్పందన: డయల్ 100 / 112 ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడంలో సమయ పాలన పాటించాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.
🔷సాంకేతిక లోపాల సవరణ: కాల్స్ స్వీకరించడంలో లేదా సమాచారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో నిపుణులు వివరించారు.
🔷ప్రజలతో మర్యాదపూర్వక ప్రవర్తన: అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసే బాధితులతో ఫోన్ రిసీవ్ చేసుకునే సిబ్బంది ఓపికగా, మర్యాదగా వ్యవహరించాలని, వారి నుండి పూర్తి వివరాలను సేకరించాలని కమిషనర్ ఆదేశించారు.
🔷సమన్వయం: కంట్రోల్ రూమ్ సిబ్బందికి మరియు గస్తీ వాహనాల (Blue Colts & Patrol Cars) మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని నిపుణులు సూచించారు.
🔷పర్యవేక్షణ: డయల్ 100 / 112 కాల్స్ స్థితిగతులను (Status) ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
ప్రస్తుత పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ మేలుకొలుపు కార్యక్రమము నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) బి. బస్వా రెడ్డి , హైదరాబాదు నుండి వచ్చిన చీప్ టెక్నికల్ ఆఫీసర్ రాజీవ్ కృష్ణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరీష్ కృష్ణ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సి టి సి , ఎసిపిలు ప్రకాష్ , వెంకటేశ్వర రెడ్డి , శ్రీనివాస్ , రాజశేఖర్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం , సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య , మరియు సిఐలు , ఎస్సైలు , పోలీస్ స్టేషన్ రైటర్స్ మరియు డయల్ 100 / 112 సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

























