క్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో TBMBA 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs) కు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా టిబి అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి పాల్గొని TBMBA 2.0 కార్యక్రమంలోని ముఖ్య అంశాలపై శిక్షణ అందించారు.
ఈ శిక్షణలో ట్యూబర్క్యులోసిస్ (TB) వ్యాధి తొందరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం, రోగుల ఫాలోఅప్ నిర్వహించడం, మరియు హై రిస్క్ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. అలాగే గ్రామ మరియు వార్డు స్థాయిలో ఆరోగ్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలు, నివేదికల సమర్పణ విధానం గురించి కూడా తెలియజేశారు.
జిల్లాలో TB నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సిబ్బంది తమ సేవలను మరింత మెరుగుపరచి TB నియంత్రణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు రెండవ విడత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీవనశైలి వ్యాధుల పై నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం మరియు ఏప్రిల్ ఆరవ తేదీ నుండి 11వ తేదీ వరకు జాతి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు.కీటక జనీతవ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినయ్ కుమార్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో కీటక జనత వ్యాధుల 30 రోజుల ప్రణాళిక పై వివరించారు
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు, డిపిఓ విశాల రాణి, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

























