తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్ను సమృద్ధిగా కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అందించే రిపోర్టుల ఆధారంగానే రైల్వే బోగీల కేటాయింపు జరుగుతుందని కేంద్రం వివరించింది. ఎంపీ కడియం కావ్య లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ, 2026 జనవరి నాటికి సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం లోడింగ్ పూర్తయిందని, దీని కోసం1,329 రైల్వే రేక్స్ను వినియోగించినట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.























