తేదీ : 13-03-2026 నాడు తెల్లవారుజామున గన్నారం గ్రామ శివారులో ఎన్ హెచ్ 44 రోడ్డుపై జరిగిన కురానా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘటన లో నలుగురు మృత్యువాత పడి మిగిలిన వారికి గాయాలైన సంఘటన విషయంలో *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,* సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సంఘటన జరిగిన తీరు మరియు లోటుపాట్లు అన్ని పరిశీలించి యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు తెలుసుకొని , ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగు సూచనలు ఇచ్చినారు. జాతీయ రహదారి – 44 పై రక్షణ చర్యలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఇందల్వాయి మండలంలో అమరవీరులకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా సందర్శించినారు.
సిర్నాపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెప్పి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదివి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండి ప్రతి ప్రశ్నను బాగా అర్థం చేసుకుని సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ కె. వినోద్, ఇందల్వాయి ఎస్సై జి సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

























