Homeత్రిశూల్ న్యూస్ఇసుక అక్రమ రవాణా నిరోధానికి సాలూర వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు ...

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి సాలూర వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన టీ.జి.ఎం.డీ.సీ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా

నిజామాబాద్, మార్చి 07 : పొరుగు రాష్ట్రాల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని సాలూర వద్ద టీ.జీ.ఎం.డీ.సీ ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ను నెలకొల్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా చెక్ పోస్ట్ ను శనివారం లాంచనంగా ప్రారంభోత్సవం చేశారు.ఈ చెక్ పోస్ట్ వద్ద వేయింగ్ మెషిన్ తో ఇసుక వాహనాల తనిఖీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా అక్రమ ఇసుక రవాణాతో పాటు, ఓవర్ లోడింగ్ ను సైతం నిరోధించేందుకు ఆస్కారం కలిగిందని ఎం.డీ భవేష్ మిశ్రా ఈ సందర్భంగా వెల్లడించారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుని మహారాష్ట్ర నుండి నిర్ణీత పరిమాణంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించవచ్చని, అయితే సాలూర చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇదివరకు చెక్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇసుక రవాణా విషయంలో పలు అక్రమాలు జరిగేవని, ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుందని తెలిపారు. అంతేకాకుండా ఓవర్ లోడ్ సమస్యను నిరోధించడం ద్వారా రోడ్లు చెడిపోకుండా, రోడ్డు ప్రమాద సంఘటనలు జరుగకుండా నిలువరించవచ్చని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్ కు సమీపంలోనే మహారాష్ట్ర ఇసుక క్వారీలు ఉన్నందున ఇసుక అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుక లభ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంజీరాలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పాటు చేశామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని, ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. ఇసుక తవ్వకం, రవాణాలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇప్పటికే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఎం.డీ భవేష్ మిశ్రా గుర్తు చేశారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చెక్ పోస్ట్ నిర్వహణ సజావుగా జరగాలని, గట్టి నిఘాను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏ.డీ సంజయ్, ల్యాండ్ అండ్ సర్వే ఏ.డీ అశోక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...
Translate »
error: Content is protected !!