గిరిజనులకు రూ.12,600 కోట్లు: భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.12,600 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ‘ఇందర సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో తోటల పెంపకాన్ని ప్రోత్సహించి, 2.10 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ పథకాన్ని అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు

























