నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’* లో భాగంగా నేడు * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్.,* ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ లలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇట్టి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయం మరియు ఏసిపి కార్యాలయంలో సంబంధిత అధికారులు మరియు తోటి సిబ్బంది పాల్గొనడం జరిగింది.























