Homeతెలంగాణరైతు సంఘర్షణ సభ, గద్వాల్

రైతు సంఘర్షణ సభ, గద్వాల్

కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది. వెంటనే వారికి రుణమాఫీ చేయాలి.ప్రజల కోసం కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్న… ఆ ఆయుధం మీ చేతిలో రాజకీయ అస్త్రమవుతది.నడిగడ్డ సీడ్ పత్తి రైతులకు వారంలోగా బకాయిలు చెల్లించాలి.లేదంటే రైతులందరితో కలిసి గద్వాల్ లో పెద్ద ఎత్తున దీక్ష చేపడతాం.తుమ్మిళ్ల, నెట్టింపాడు పనులు చూసి నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయి.డిగడ్డ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ కూడా అన్యాయం చేస్తోంది.రైతు సంఘర్షణ సభ లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో కలిసి వెళ్లిన కవిత కలెక్టరేట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.

*అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగిన కవిత గారు, రైతులు.*

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కి వారిని మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందన్నారు. రైతు రుణమాఫీ కి సంబంధించిన లెక్కలపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ పట్ణణంలో జరిగిన రైతు సంఘర్షణ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. నడిగడ్డ సీడ్ పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయం పై ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఇవ్వకపోతే గద్వాల్ లో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతులతో కలిసి దీక్ష చేపడతామన్నారు. రైతులకు కరెంట్, యూరియా సప్లయ్ చేయటం కూడా ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దేవా చేశారు. యూరియా కోసం యాప్ లో బుక్ చేసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టటాన్నిఆక్షేపించారు. ముందు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ తర్వాత యాప్ లో బుక్ చేసుకునే విధానం తేవాలన్నారు. రైతు భరోసాను ఈ ముఖ్యమంత్రి ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ చేసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు రైతు భరోసా వేస్తామంటూ నిసిగ్గుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రభుత్వానికి రైతులు గుర్తు వస్తున్నారన్నారు. అటు అడవిలో అన్నలకు, ఇటు రైతన్నలకు మాత్రమే అందరూ భయపడతారని గుర్తు చేశారు. ఐతే అన్నలను కేంద్రం అమానవీయంగా చంపుతుంటే…రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా ఇబ్బంది పెడుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని…రైతన్నలను తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ కు ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారని అన్నారు. రైతన్నలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నడిగడ్డ ప్రజలకు మోసం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్. గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని ఆమె చెప్పుకొచ్చారు. రాజకీయాలు చేయాలంటే నిజాయితీ, ధైర్యం ఉండాలన్నారు. దమ్ముంటే గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని వ్యక్తి ప్రజలకు ఏమీ మంచి చేస్తారో ఆలోచించాలని అన్నారు. ఇక నడిగడ్డకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మిళ్ల, నెట్టంపాడు పనులను చూస్తుంటే నత్తలు కూడా సిగ్గుపడుతాయని విమర్శించారు. కృష్ణ, తుంగభద్ర నదులు మనల్ని దాటుకొని వెళ్తున్న సరే ఇక్కడి ప్రజలకు నీళ్లు రావటం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడి ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇలా అయితే నడిగడ్డ రైతు ఎప్పుడు బాగుపడేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసే వజ్రాయుధమవుతాం.బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేందుకు త్వరలోనే పార్టీతో మీ ముందుకు వస్తున్నానని మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నానని అది ప్రజలకు వజ్రాయుధం అవుతుందని కవిత అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మా తమ్ముడు గవినోళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో వడ్డెపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్నామని…గద్వాల్ నుంచే జాగృతి జాగృతి జైత్రయాత్ర మొదలైందని చెప్పారు. ఎవరు గెలిచినా సరే వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లే పిచ్చి రాజకీయాలు జిల్లాలో నడుస్తున్నాయని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మూటలతో వస్తారని…వాళ్లు ఇచ్చింది తీసుకోని మీ కోసం పనిచేసే వాళ్లకే ఓటు వేయాలని కవిత పిలుపునిచ్చారు. మీ నెత్తి కొట్టి సంపాదించిన సొమ్మును కచ్చితంగా తీసుకోండని ప్రజలకు సూచించారు. గద్వాల్ లో అత్త, అల్లుడే కాకుండా కొత్త నాయకత్వం రాబోతుందని అన్నారు. నడిగడ్డ ప్రజల కోసం పోరాడుతున్న నడిగడ్డ పోరాట హక్కుల సమితి ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ ను ఆశీర్వదించాలని కోరారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.సభ అనంతరం రైతుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు వెంట రాగ కవిత కలెక్టరేట్ కు బయలు దేరారు. అయితే కలెక్టరేట్ లోపలకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు కలెక్టరేట్ గేట్ కు తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కవిత సహా రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రైతులతో కలిసి కలెక్టరేట్ లోకి వెళ్లి కలెక్టర్ సంతోష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...
Translate »
error: Content is protected !!