Homeతెలంగాణరైతు సంఘర్షణ సభ, గద్వాల్

రైతు సంఘర్షణ సభ, గద్వాల్

కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది. వెంటనే వారికి రుణమాఫీ చేయాలి.ప్రజల కోసం కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్న… ఆ ఆయుధం మీ చేతిలో రాజకీయ అస్త్రమవుతది.నడిగడ్డ సీడ్ పత్తి రైతులకు వారంలోగా బకాయిలు చెల్లించాలి.లేదంటే రైతులందరితో కలిసి గద్వాల్ లో పెద్ద ఎత్తున దీక్ష చేపడతాం.తుమ్మిళ్ల, నెట్టింపాడు పనులు చూసి నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయి.డిగడ్డ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ కూడా అన్యాయం చేస్తోంది.రైతు సంఘర్షణ సభ లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో కలిసి వెళ్లిన కవిత కలెక్టరేట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.

*అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగిన కవిత గారు, రైతులు.*

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కి వారిని మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిందన్నారు. రైతు రుణమాఫీ కి సంబంధించిన లెక్కలపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ పట్ణణంలో జరిగిన రైతు సంఘర్షణ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. నడిగడ్డ సీడ్ పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయం పై ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఇవ్వకపోతే గద్వాల్ లో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతులతో కలిసి దీక్ష చేపడతామన్నారు. రైతులకు కరెంట్, యూరియా సప్లయ్ చేయటం కూడా ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దేవా చేశారు. యూరియా కోసం యాప్ లో బుక్ చేసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టటాన్నిఆక్షేపించారు. ముందు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ తర్వాత యాప్ లో బుక్ చేసుకునే విధానం తేవాలన్నారు. రైతు భరోసాను ఈ ముఖ్యమంత్రి ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ చేసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు రైతు భరోసా వేస్తామంటూ నిసిగ్గుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రభుత్వానికి రైతులు గుర్తు వస్తున్నారన్నారు. అటు అడవిలో అన్నలకు, ఇటు రైతన్నలకు మాత్రమే అందరూ భయపడతారని గుర్తు చేశారు. ఐతే అన్నలను కేంద్రం అమానవీయంగా చంపుతుంటే…రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా ఇబ్బంది పెడుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని…రైతన్నలను తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ కు ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారని అన్నారు. రైతన్నలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నడిగడ్డ ప్రజలకు మోసం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్. గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని ఆమె చెప్పుకొచ్చారు. రాజకీయాలు చేయాలంటే నిజాయితీ, ధైర్యం ఉండాలన్నారు. దమ్ముంటే గద్వాల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని వ్యక్తి ప్రజలకు ఏమీ మంచి చేస్తారో ఆలోచించాలని అన్నారు. ఇక నడిగడ్డకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మిళ్ల, నెట్టంపాడు పనులను చూస్తుంటే నత్తలు కూడా సిగ్గుపడుతాయని విమర్శించారు. కృష్ణ, తుంగభద్ర నదులు మనల్ని దాటుకొని వెళ్తున్న సరే ఇక్కడి ప్రజలకు నీళ్లు రావటం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడి ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇలా అయితే నడిగడ్డ రైతు ఎప్పుడు బాగుపడేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసే వజ్రాయుధమవుతాం.బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేందుకు త్వరలోనే పార్టీతో మీ ముందుకు వస్తున్నానని మీ ఆశీర్వాదం కావాలంటూ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నానని అది ప్రజలకు వజ్రాయుధం అవుతుందని కవిత అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మా తమ్ముడు గవినోళ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో వడ్డెపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్నామని…గద్వాల్ నుంచే జాగృతి జాగృతి జైత్రయాత్ర మొదలైందని చెప్పారు. ఎవరు గెలిచినా సరే వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లే పిచ్చి రాజకీయాలు జిల్లాలో నడుస్తున్నాయని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మూటలతో వస్తారని…వాళ్లు ఇచ్చింది తీసుకోని మీ కోసం పనిచేసే వాళ్లకే ఓటు వేయాలని కవిత పిలుపునిచ్చారు. మీ నెత్తి కొట్టి సంపాదించిన సొమ్మును కచ్చితంగా తీసుకోండని ప్రజలకు సూచించారు. గద్వాల్ లో అత్త, అల్లుడే కాకుండా కొత్త నాయకత్వం రాబోతుందని అన్నారు. నడిగడ్డ ప్రజల కోసం పోరాడుతున్న నడిగడ్డ పోరాట హక్కుల సమితి ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ ను ఆశీర్వదించాలని కోరారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.సభ అనంతరం రైతుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున రైతులు వెంట రాగ కవిత కలెక్టరేట్ కు బయలు దేరారు. అయితే కలెక్టరేట్ లోపలకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు కలెక్టరేట్ గేట్ కు తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కవిత సహా రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం రైతులతో కలిసి కలెక్టరేట్ లోకి వెళ్లి కలెక్టర్ సంతోష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...
Translate »
error: Content is protected !!