*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం*
*మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు*
*కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు*
*టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు*
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను వంచించే పాలన కొనసాగుతుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను చెల్లించాలని లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు.గ్రామీణ ప్రాంతాలు నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ప్రభుత్వం ఫీజుబకాయలు ఇస్తుందన్న నమ్మకంతో ఉచిత విద్యను అందజేసిన కళాశాలలకు బకాయిలను ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని గమనించి ఫీజుబకాయలను విడుదల చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతే రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్ లు పాల్గొనడం జరిగింది.























