బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డిపై బెలోజి నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, బెలోజి నాయక్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల బంజారా సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

























