బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

బీబీపేట: గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, అయ్యప్ప స్వామికి అభిషేకం, అర్చనలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అయ్యప్ప నామస్మరణలు, భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.

























