భీంగల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలు వరుసగా రెండో రోజు కొనసాగాయి.
పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు… నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగిస్తున్న దుకాణదారులను గుర్తించి జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ… హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నివారించాలని సూచించారు.
ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని… వ్యాపారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ గజానంద్ సూచించారు.
ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై కూడా తనిఖీలు కొనసాగించి జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

























