ఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్* ను డివిజన్ ఉపాధ్యక్షులు ఎం నారగౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) జిల్లా కోశాధికారి ఎం లింబాద్రి మంగళవారం నాడు ఒక పత్రిక ప్రకటన ధ్వారా తెలిపారు.
సిరికొండ మండలం లోని రావుట్ల గ్రామానికి చెందిన రిక్క దామోదర్ ను కమ్మర్ పల్లిలో జరిగిన జనరల్ కౌన్సిల్ లో ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. కామ్రేడ్ రిక్క దామోదర్, PDSU విద్యార్థి సంఘం లో సుధీర్గంగా పని చేశారని, ఆతరువాత PYL యువజన సంఘంలో పని చేశారు అన్నారు. CPI(ML) మాస్ లైన్ పార్టీ సీనియర్ నాయకులు గా పని చేసిన అనుభవం ఉన్నందున *అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఏఐయుకెఎస్)* లో డివిజన్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్నారు అన్నారు. సిరికొండ మండలం లోని గడ్కోల్ గ్రామానికి చెందిన ఎం నారగౌడ్ ను, ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షులుగా ఏన్నుకున్నారన్నారు. ఎం నారగౌడ్ *CPI(ML) మాస్ లైన్* సీనియర్ గా సేవలు అందించారని, గత 20ఏళ్లుగా రైతంగా పోరాటల్లో కీలకంగా పని చేసినందు ఆయన ఉపాధ్యక్షులు గా ఎన్నుకున్నారు. డివిజన్ కమిటీ సభ్యుడిగా బట్టు సర్పంచ్ సాయులు ఎన్నుకున్నట్టు గా ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

























