మైక్రో రేషన్ కార్డుల పంపిణీ
46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47వ వార్డుల్లో మైక్రో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 9,005 కృష్ణాగౌడ్ కంట్రోల్ షాప్కు సంబంధించిన లబ్ధిదారులకు మైక్రో రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మైక్రో రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్, జీపీవో అధికారులు సూరజ్, సంతోష్రెడ్డి, సంజీవ్, రవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

























