ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
కామారెడ్డి: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల భద్రతకు భరోసా కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, సమిష్టి కృషితో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పోలీసు శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























