నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని ఎవరైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించాలని చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య,ఐపీఎస్.,*తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నేడు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీ లో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని *పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ,ఐ.పీ.ఎస్*,. తెలియజేశారు.
ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయాలని లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతు అల్లరి జరిగినట్లయితే ఎవరి పట్ల ఎలాంటి ఉపేక్షించవద్దని అందరి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ ఏ.సీ.పి శ్రీనివాస్ , రుద్రూర్ సీ.ఐ కృష్ణ , రుద్రూర్ ఎస్సై సాయన్న మరియు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది.























