జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం నకు చెందిన మొబైల్ హెల్త్ టీం సిబ్బందికి కార్డియో పల్మనరీ రీససిటేషన్ ( CPR ) పై శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్ తెలియజేశారు.
ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కే మొబైల్ హెల్త్ టీం సిబ్బంది అందరూ వారి వారి ఏరియాల్లో వారికి కేటాయించిన పాఠశాలల్లో, అంగన్వాడి కేంద్రాల్లో వారి షెడ్యూల్ ఆధారంగా తప్పకుండా విజిట్ చేసి పాఠశాల, అంగన్వాడి విద్యార్థులు అందరినీ పరీక్షించడం మరియు అవసరమైన వారిని డిఈఐసి కేంద్రానికి రిఫర్ చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిపిఆర్ పై అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సి పి ఆర్ శిక్షణను డాక్టర్ వెంకటేష్ మరియు వేణుగోపాల్ ఇవ్వడంతోపాటు అన్ని టీముల అభ్యర్థుల చేత సిపిఆర్ చేసే విధానంపై ప్రాప్తిస్ చేయించడం జరిగింది. శిక్షణ అనంతరం వారికి కేటాయించిన విధులకు సంబంధించి సమీక్షను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలోప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అశోక్ , డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అరవింద్ ,డాక్టర్ విజయభాస్కర్, డి హెచ్ఈ.లు వేణుగోపాల్, ఘనపూర్ వెంకటేశ్వర్లు , వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

























