*ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలను తగ్గించండి*
నిజమాబాద్ జిల్లా: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల లోపు మరణాల పై సమీక్షను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జ్ ను పెంచుకుంటూ వైద్య సేవలను అందించాలని. స్త్రీల లో మరియు చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను క్రమం తప్పకుండా వారి ఇంటి వద్ద ఫాలో అప్ చేయాలని అన్నారు.సిపిఆర్ పట్ల అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి గర్భిణీ స్త్రీని,ప్రతి బాలింతని ఫాలోఅప్ విజిట్స్ లో తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలన్నారు. వేరే ప్రాంతాల నుండి తల్లి గారి ఇంటికి వచ్చిన మన వద్ద నుండి వేరే ప్రాంతానికి వెళ్లిన మదర్ ఇన్, మదర్ ఔటు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నారు తద్వారా ఫాలోఅప్ సక్రమంగా నిర్వహించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని అన్నారు. ప్రధమ చికిత్స కిట్టును ఎమర్జెన్సీ కిట్టును అందరివద్దా అందుబాటులో ఉండాలని, బిడ్డకు బిడ్డకు మధ్య వ్యత్యాసం పాటించేలా అవగాహన కలిగించాలని శాశ్వత మరియు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కౌన్సిలింగ్ చేసి అంతరా ,ఐయుడి పిపీఐయుసిడి ,వాడేలా చూడాలన్నారు. గర్భిణీ స్త్రీ సమయంలో కళ్ళు తాగే అలవాటు ఏ స్త్రీకైనా ఉంటే వారిని కౌన్సిలింగ్ చేసి వారి ఎంసీఏచ్ కార్డు పైన వారి సంతకం తీసుకోవాలన్నారు,
అంతిమంగా మన చేతిలో ఉండి ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా కాపాడదగ్గ ప్రాణాలు అన్నిటిని కాపాడే బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నిరూప్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని, అనుబంధ ఆహారంపై, తల్లిపాలపై మరియు చెవిలో ముక్కులో నూనె వేయడం వల్ల కలిగే అనర్ధాలపై , చిన్నపిల్లలు సరిపడా నిద్రపోకపోయినా, పాలు త్రాగకపోయినా, మూత్రం చేయకపోయినా అనుమానించి వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి అన్నారు. స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ రోహిణీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు 5 లేదా 6 గ్రాముల హెచ్డి ఉంటే వారి పట్ల ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తూ ఐరన్ సుక్రోజ్ మరియు న్యూట్రిషన్ అందించాలన్నారు గర్భిణీ స్త్రీలకు సీబీపీ, హిమగ్లోబిన్ ,బిపి రికార్డు హైట్, వెయిట్ పరీక్షించాలని కనీసం నాలుగు సార్లు వైద్యని చేత పరీక్షించాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్ ఎం అశోక్, అనొస్తటిస్ట్ డాక్టర్ సుజయ్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లు డాక్టర్ అశ్విని, డాక్టర్ సమత, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్వేత, సిడిపిఓలు , జానకి,జ్యోతి, రాంబాబు, డి హెచ్ ఈ లు గన్పూర్ వెంకటేశ్వర్లు,మనోహర్ వివిధ పీహెచ్ ల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

























