Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి

 కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

 క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన


నిజామాబాద్, ఏప్రిల్ 08 : ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం రూ. 33.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, ఇంకనూ చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా కొనసాగుతుండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధప్రతపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకుని ఉన్నందున ఏరియా ఆసుపత్రి నిర్మాణం పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో ఇసుక వాహనాలు తిరుగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఏ.ఈ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...
Translate »
error: Content is protected !!