Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి

 కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

 క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన


నిజామాబాద్, ఏప్రిల్ 08 : ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ౩౦ పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం రూ. 33.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ధర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, ఇంకనూ చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకొడిగా కొనసాగుతుండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలని గడువు విధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధప్రతపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, పనితీరులో మార్పు కనిపించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో కూడుకుని ఉన్నందున ఏరియా ఆసుపత్రి నిర్మాణం పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని, టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో ఇసుక వాహనాలు తిరుగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్ రోడ్డును సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ శాంత, టీజీఎంఐడీసీ ఏ.ఈ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...
Translate »
error: Content is protected !!