ఉపాధి హామీ పనులను పరీవేక్షించిన ఎంపీడీవో లక్ష్మారెడ్డి
సోమవారం : 13/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ఉపాధి హామీ పనులను ఎంపీడీవో లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించారు. కూలీల హాజరు వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కూలీలు కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి, ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమేష్ ఉప సర్పంచ్ చంద్రకాంత్ సెక్రటరీ ప్రవీణ్ ఏపిఎం టిఏ మరియ వార్డు సభ్యులు ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు























