సిర్పూర్లో మిన్నంటిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. ప్రగతి బాటలో నడుస్తామన్న గ్రామస్తులు
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. మోపాల్ మండలం, సిర్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, ఆయన చూపిన బాటలోనే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.
అణగారిన వర్గాల గొంతుక, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ పుట్టినరోజు వేడుకలు సిర్పూర్ గ్రామంలో పండుగలా జరిగాయి. తెల్లవారుజామునే అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించిన యువకులు, విగ్రహాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించారు. సర్పంచ్ గౌతమి గణేష్ గ్రామ ప్రజలతో కలిసి, గ్రామస్తులందరూ బాబాసాహెబ్కు ఘన నివాళులర్పించారు.
“అంబేద్కర్ చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సిర్పూర్ గ్రామంలో విద్య, వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని సర్పంచ్ గౌతమి గణేష్ ధీమా వ్యక్తం చేశారు.
“బాబాసాహెబ్ జయంతి సందర్భంగా సిర్పూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలు తెలిపారు.
“బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సిర్పూర్ గ్రామంలో ఐకమత్యానికి ప్రతీకగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషమని. కేవలం విగ్రహాలకు దండలు వేయడమే కాకుండా, ఆయన ఆశయాలను ఆచరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉప సర్పంచ్ భాస్కర్ పిలుపుకు గ్రామస్తులు మద్దతు ప్రకటించారు.


























