ధర్పల్లి మండలంలో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు
శుక్రవారం : 01/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు కార్మిక దినోత్సవాన్ని స్థానిక కార్మిక వర్గాలు జరుపుకున్నాయి ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య పాల్గొన్నారు ఈయనతోపాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులు బాలయ్య భూమేష్ మమత రజిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గాలన్నీ సంఘటితమై హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు
కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు.

























