జేఈఈ మెయిన్స్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం…
శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్
జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన పద్మశాలి సమాజానికి చెందిన ప్రతిభావంతురాలు కుమారి బాలే శివానిని వాల్గొట్ అన్నపూర్ణదేవి ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, జిల్లా పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, ఉపాధ్యక్షుడు విజయసారథి, నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి సునీల్, చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు తన్నీర్ శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ సంఘం-2 అధ్యక్షుడు గుజ్జెటి రాము, స్థానిక సర్పంచ్ వనిత సంతోష్, ఎంపీఓ నాయక్, జిడ్డు సత్యపాల్, ధర్మంవీర్, లోలం జగదీశ్, రాజేశ్వర్ తదితరులు కలిసి శివానికి రూ.21,000 నగదు బహుమతి, మెమెంటో మరియు శాలువాతో సత్కరించారు.
వక్తలు మాట్లాడుతూ, శివాని సాధించిన ఈ ఘన విజయం పద్మశాలి సమాజానికే కాకుండా జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

























