నడిమితండ గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన విద్యార్థినుల సన్మానం
శుక్రవారం : 05/06/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నడిమితండ గ్రామపంచాయతీ పరిధికి చెందిన గిరిజన విద్యార్థినులు శిరీష మరియు రజిత ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణత సాధించారు. అలాగే వారికి **బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)**లో సీట్లు లభించడంతో, గుడి తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలవత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులను అభినందిస్తూ, ఉన్నత విద్యలో మరింత రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేలు నాయక్, గోవింద్ నాయక్, మలవత్ రామచందర్, మలవత్ రవి, మలవత్ గోవింద్, మలవత్ రెడ్యా, రవి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

























