ధర్పల్లి పాఠశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత
బుధవారం : 06/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవం జరిగింది. హెడ్మాస్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ధ్రువపత్రాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్య ధిక మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

























