అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్ టీం మెరుపు దాడి : పోలీస్ కమీషనర్ వెల్లడి. 2 చోట్ల దాడుల నిర్వహణ
బుధవారం నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి . సాయి చైతన్య, ఐ. పి. ఎస్., ఆదేశాల మేరకు, సీ.సీ.ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నేడు
1) నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాళేశ్వర్ గ్రామ వాగు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చీతా ఫోర్స్ టీం మెరుపు దాడి నిర్వహించింది. అక్కడ జేసీబీ సహాయంతో వాగు నుండి ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో ఒక జేసీబీ యంత్రంతో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించారు.
2) నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళ్లవేద గ్రామ వాగులో అక్రమంగా ఇసుకని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు 5 ట్రాక్టర్ లు తదుపరి చర్య నిమిత్తం నవీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కి అప్పగించనైనది
అక్రమ ఇసుక రవాణా, ప్రకృతి వనరుల దోపిడీపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

























