విజయరెడ్డి పార్థివదేహానికి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఘన నివాళి
అనారోగ్యంతో మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయ రెడ్డి అనారోగ్యంతో మరణించిన ఘటన బాధాకరమని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. విజయ రెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ లోని వారి నివాసంలో బుధవారం నిర్వహించగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ హందాని తదితరులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయరెడ్డి పార్థివదేహం వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి .. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

























