పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చూపిన బాటలో నడుద్దాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఘన నివాళి
ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్న ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరు నెహ్రూ చూపిన మార్గంలో నడవాలని పిలుపు
భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఆ మహనీయుడి 62 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆ మహనీయుడు నడిపిన కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

























