మెంట్రాజ్ పల్లి గ్రామం లో వీధి కుక్క కరవడంతో బాలుడికి గాయాలు
గ్రామంలో పెరిగిన కుక్కలు, కోతుల బెడదపై గ్రామస్తుల ఆందోళన
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో రోడ్డుపైకి రావాలంటే చిన్నారులు మాత్రమే కాకుండా పెద్దలు కూడా భయపడే పరిస్థితి నెలకొన్నదని వారు చెబుతున్నారు. అలాగే కోతుల బెడద కూడా అధికమై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు.శుక్రవారం ఉదయం గ్రామంలో వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు వెంటనే స్పందించి కుక్కను తరిమేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.గాయపడిన బాలుడికి చికిత్స అందించారు.మగ్గిడి.సాయి హర్షిత్. అమ్మ పేరు. మగ్గిడి. పద్మ నాన్న పేరు.మగ్గిడి.వినోద్ గ్రామస్తుల సమాచారం ప్రకారం,గతంలో కూడా ఇదే గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి లేగదూడలను కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.కొంతమంది గ్రామస్తులపై కూడా దాడి చేసి గాయపరిచిన సందర్భాలు ఉన్నాయని,చికిత్స అనంతరం వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కలు,కోతుల సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకొని ప్రజలను రక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పిసరి.ప్రతాప్ మండల స్థాయి అధికారులను డిమాండ్ చేశారు.

























