Homeతెలంగాణఅంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త.. పునర్నియామకాలకు ప్రభుత్వం అనుమతి

అంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త.. పునర్నియామకాలకు ప్రభుత్వం అనుమతి

అంగన్‌వాడీ సిబ్బందికి భారీ ఊరట
ఎన్నికల్లో ఓడి ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, హెల్పర్ల పునర్నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


హైదరాబాద్, జూన్ 14:

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్‌వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునే (పునర్నియామకం) ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ప్రత్యేక చొరవతో ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసినందుకు అంగన్‌వాడీ మహిళలు తమ ఉపాధిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైన సేవలు అందిస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేసి, ఎన్నికల్లో విజయం సాధించని అంగన్‌వాడీ సిబ్బంది సమర్పించే దరఖాస్తులను నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించనున్నారు. అయితే, సదరు అంగన్‌వాడీ టీచర్ లేదా హెల్పర్ రాజీనామా చేసిన పోస్టులో ఇప్పటివరకు కొత్త నియామకం జరగకుండా ఆ స్థానం ఖాళీగా ఉన్న సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న అనేక మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించనున్నాయి. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, వీలైనంత త్వరగా వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని జిల్లా సంక్షేమ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

లంపి చర్మ వ్యాధిని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ఇంట్లో మేకపాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది

0
ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం పూణే: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్ ప్రొడక్ట్స్ (IVBP) ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర అంతటా వేలాది జంతువులను చంపిన ముద్ద...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

లంపి చర్మ వ్యాధిని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ఇంట్లో మేకపాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది

0
ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం పూణే: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్ ప్రొడక్ట్స్ (IVBP) ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర అంతటా వేలాది జంతువులను చంపిన ముద్ద...
Translate »
error: Content is protected !!