పుస్తక పఠనం అలవాటు చేసుకోండి.. డీజీపీ శివధర్ రెడ్డి
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్లోని రెబ్బెన మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ గ్రంథాలయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఉన్నత లక్ష్యాల సాధన కోసం యువత పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్లలో సమయాన్ని వృథా చేయకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం ఈ గ్రంథాలయంలో అన్ని రకాల పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నీతిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.























