బడా భీంగల్లో యూరియా కోసం రైతుల ధర్నా…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని రైతులు ఈరోజు ధర్నా నిర్వహించారు.
ప్రస్తుతం పంటలకు అత్యవసరంగా యూరియా అవసరం ఉన్నప్పటికీ, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత కారణంగా పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రైతుల అవసరాలను గుర్తించి వెంటనే సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. పంటలను కాపాడుకోవడానికి అవసరమైన ఎరువులను సకాలంలో పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులకు యూరియాను వెంటనే అందించి, పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ధర్నాలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేశారు.

























