కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలకు సమర్థవంతంగా సమాధానం ఇవ్వడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడిగా వాకా మహేష్ చురుకుగా పనిచేస్తూ వస్తున్నారు. గతంలోనూ పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తూ తనదైన శైలిలో వాణిని వినిపించారు.తనకు అధికార ప్రతినిధిగా నియమించడానికి కృషి చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపెల్లి నాగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వాకా మహేష్ తెలిపారు.

























