అంబెద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
సోమవారం నాడు భీంగల్ మండలం సుదర్శన్ నగర్ తండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబెద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. Educate, Agitate, Organize”
“విద్యను అభ్యసించండి, చైతన్యవంతులై పోరాడండి, సంఘటితం కండి.” అంటూ నినదించి సమాజంలో అసమానతలను రూపుమాపడానికి తన జీవితాంతం కృషి చేశాడని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్ లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























