బోరు మోటార్ మరమ్మతు చేయించి సేవాభావం చాటిన కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి పట్టణంలోని 41వ వార్డులో బోరు మోటార్ చెడిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్ స్పందించి బోరు మోటార్ను మరమ్మతు చేయించారు. దీంతో వార్డులో నీటి సరఫరాకు అంతరాయం తొలగి స్థానికులకు ఉపశమనం లభించింది.
ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి బోరు మోటార్ను బాగు చేయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న కాళ్ళ రాజమణి గణేష్ ను వార్డు ప్రజలు అభినందించారు. ప్రజాసేవలో ముందుండి స్పందించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

























