ధర్పల్లి మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఎంపీపీఎస్ ధర్పల్లి పాఠశాలలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ధర్పల్లి బీజేపీ మండల అధ్యక్షులు జీర్రా మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీర్ర మైపాల్ మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జీర్రా మహిపాల్, కోమటి దాసు, కర్క గంగారెడ్డి, సరి చందు, దోర్నాల రాజశేఖర్, అమ్రు నాయక్, సేవాలాల్, నరేష్, మురళి, రవీందర్, తాళ్ల రాము, రామ్ చందర్, తిరుపతి, మోహన్, గోపి, భగత్, భాస్కర్, గోపాల్, శ్రీకాంత్, వెల్దుర్తి రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

























