Homeతెలంగాణతెలంగాణలో పునర్విభజనతో కొత్త స్థానాలు.. రిజర్వేషన్లు ఇవే - ఈ సీట్ల కుదింపు

తెలంగాణలో పునర్విభజనతో కొత్త స్థానాలు.. రిజర్వేషన్లు ఇవే – ఈ సీట్ల కుదింపు

తెలంగాణలో పునర్విభజనతో కొత్త స్థానాలు.. రిజర్వేషన్లు ఇవే  ఈ సీట్ల కుదింపు…


_తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా డీ లిమిటేషన్ అమలుకు సిద్దమైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం దిశగా కసరత్తు చేస్తోంది._

_తెలంగాణ సీఎం రేవంత్ నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నారు. కాగా, కేంద్రం ఇప్పటికే 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజనకు సిద్దమైంది. దీంతో.. కొత్తగా వచ్చే ఎంపీ స్థానాలు.. రిజర్వేషన్ల పైన దాదాపు స్పష్టత వచ్చింది._

_కేంద్రం 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోంది. 2029 లోనే ఈ కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా.. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమేటషన్ తో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 26కి చేరనుంది. కాగా.. 2011 జనాభా లెక్కల మేరకు నియోజకవర్గాల పెంపు జరగనుండటంతో.. కొత్త నియోజకవర్గాల పైన స్పష్టత వచ్చింది. ఈ లెక్క ప్రకారం రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 52,96,741 జనాభాతో రాష్ట్రంలో మొదటిస్థానంలో.. ప్రస్తుతం మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలు పరిధిలో విస్తరించి ఉంది. వీటి పరిధులన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో హైదరాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో జనాభా అధికంగా ఉన్నారు. కాగా, దీనిని దృష్టిలో ఉంచుకుని వీటిని విభజించి కొత్తగా నాలుగు లోక్ సభ స్థానాలుగా పెంచే అవకాశం కనిపిస్తోంది. మల్కాజ్ గిరి దేశంలోనే అధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావటంతో ఇది రెండు స్థానాలుగా మారనుంది._

*_డీలిమిటేషన్ తో మారనున్న రాజకీయ ముఖచిత్రం_*

_ఇక, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు వేరుచేసి కొత్తగా మరో రెండు స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా మరొక స్థానం ఏర్పాటు కానుంది. ఇక, మహబూబ్ నగర్ – నాగర్ కర్నూలు ను విభజించి మరో స్థానం ఏర్పాటు చేసే విధం గా కసరత్తు జరుగుతోంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పరిధిలో మరో రెండు స్థానాలు రానున్నాయి. ఇక.. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొండనుండటంతో.. రాష్ట్రంలో మహిళల కు 2029 ఎన్నికల నుంచి 9 స్థానాలు కేటాయించనున్నారు. అదే విధంగా అసెంబ్లీ స్థానాల్లోనూ మహిళలకు 55 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తరువాత కేంద్రం డీ లిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయనుంది. అభిప్రాయ సేకరణ తరువాత.. కేంద్రానికి ఇచ్చే నివేదిక.. ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాత ఈ కొత్త నియోజకవర్గాల పైన అధికారికంగా గెజిట్ విడుదల కానుంది. దీంతో.. ఈ డీలిమిటేషన్ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...
Translate »
error: Content is protected !!