కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న
కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు ఆదివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగిన జాతీయ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ కమల్ కు శాలువా కప్పి మెమొంటో, ప్రశంస పత్రాన్ని బహుకరించారు.. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ మాట్లాడుతూ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తూన్న కమల్ విద్యారంగానికి అందిస్తున్న అంకితభావం, నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మకత, విద్యార్ధుల పట్ల చూపుతున్న ఆప్యాయత, బాధ్యత, ఆదర్శవంతమైన సేవలు అభినందనీయం అని అన్నారు.
విద్యార్థులలో జ్ఞానాన్ని వెలిగిస్తూ, వారి ప్రతిభను వెలికితీస్తూ, విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. అని అన్నారు.
కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయునిగా మీ వంతు విలువైన పాత్రను నిర్వర్తిస్తూ, విద్యకు విద్యార్థులకు, సమాజానికి మీరు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ విద్యార్థిని విద్యార్థులకు సక్రమమైన బోధన, ఉన్నత విద్య, విలువలు అందిస్తున్న సందర్భంగా కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు చిందం, ప్రకాష్, పసక సంధ్య,నవీత, కళ్యాణి, గంగాధర్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

























