108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉస్తావాల లో భాగంగా శనివారం గణపతి దేవునికి 108 రకాల ప్రసాదాల తో నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి కమ్మర్పల్లి మండల ఎస్సై సతీష్ హాజరై, గణేశున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో అందరూ సుఖసంతోషాలతో ఉండేలా ఆ గణేశుడు చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.108 ప్రసాద నైవేద్యాలను చూసి ఆనందించారు.ఎస్సై ని సంఘం సభ్యులు శాలువాతో స్వాగతించి ప్రత్యేక పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పురోహితులు గంగా ప్రసాద్, సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు సదానంద్ రెడ్డి,సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.























