నిజామాబాదు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహణ
యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది : పోలీస్ కమీషనర్ వెల్లడి
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Say no to drugs , yes to life అనే నినాదం తో యువత ముందుకు వెళ్ళాలి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ చౌరస్తా వద్ద ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* హాజరై జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యువత సన్మార్గంలో నడవాలి చెడు అలవాట్లకు దూరముగా ఉండాలి , డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అనే సందేశం ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ “యువతే దేశానికి భవిష్యత్తు. మీలో ఉన్న శక్తి , సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే మీరు మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రీడలు, వ్యాయామం చాలా అవసరం. అలాంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యంత అవసరం. ఒకసారి ఆ అలవాట్లలో పడితే బయటపడటం చాలా కష్టం. కాబట్టి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి మార్గాన్ని ఎంచుకోండి. మరియు మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది కావున యువకులు మరియు విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై డ్రగ్స్ బారిన పడకూడదని సూచించడం జరిగింది. ఈ సమాజంలో ఎవరైనా డ్రగ్స్ గాని గంజాయి గాని అమ్మిన మరియు సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 1908 నెంబర్ లేదా 100 కు కాల్ చేయాలని సూచించడం జరిగింది. డ్రగ్ ఫ్రీ సొసైటీగా తీసుకురావాలని మరియు దీనికి ప్రజల సహకారం యువత సహకారం మీడియా సహకారం ఉండాలని కోరడం జరిగింది. ప్రతీ ఒక్కరితో Say no to drugs, Yes to life అని సూచించడం జరిగింది. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినండి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. మీరు సన్మార్గంలో నడిస్తే మీ కుటుంబానికి, సమాజానికి గర్వకారణం అవుతారు.
ఈ 2K రన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచడం మాత్రమే కాకుండా, డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ అందిస్తున్నదని , అందరూ ఈ సందేశాన్ని జీవితంలో ఆచరించాలి.” ఇలాంటి సందేశం ద్వారా యువతలో సానుకూల మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు డాన్సులు మరియు నాటకాల రూపంలో గంజాయి యొక్క పర్యావసనాలని ప్రజలకు చూపించడం జరిగింది. తర్వాత 2కే రన్ ని పోలీస్ కమీషనర్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ 2 కె రన్ బై పాస్ చౌరస్తా నుండి ఐ.డి.ఓ.సి కార్యాలయం వరకు నిర్వహించడం జరిగింది. ఈ 2కె రన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమీషనర్ చేతులమీదుగా వారికి బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్) జి. బస్వా రెడ్డి , నిజామాబాదు ఏసీపీ ప్రకాష్ , ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, నిజామాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎస్సైలు ఎండి షరీఫ్ , ఆనంద్ సాగర్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గిరిరాజు కాలేజీ , సీఎస్ఐ కాలేజీ , వివేకానంద హై స్కూల్ , ప్రభుత్వ డైట్ కాలేజీ , ఎస్సీ హాస్టల్ , డిఎస్ టెక్నాలజీ మొదలగు కాలేజీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

























