నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో నవజాత శిశువులు మరియు పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ మల్లారం సుజాత శేఖర్, ఉప సర్పంచ్ సౌజన్య అశోక్ ల సమక్షంలో డాక్టర్ నిహారిక పిల్లలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.























