లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం
ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా నంబి వాసుదేవా చార్యులు,వంగల వేణు గోపాల్, నీలవేణి లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ హిందూ మతం గొప్పతనం,హిందువుల్లో ఐక్యత, భారత దేశ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తుల గురించి వివరించారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే హిందువులకు మనుగడ అని, కులాలకు అతీతంగా హిందువులు అందరూ కలిసి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంబి వాసుదేవా చార్యులు,వంగల వేణు గోపాల్, నీలవేణి,సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్,వీడీసీ చైర్మన్ గంగాధర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.























