Homeతెలంగాణసైబర్ నేరగాళ్లపై 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0' నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్

సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్

సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్


హైదరాబాద్: ఏప్రిల్ 26:రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసిఎస్బి) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. గడిచిన రెండేళ్లలో అరెస్టయిన నేరగాళ్లు మళ్లీ నేరాల బాట పట్టకుండా ఉండేలా ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ పేరిట భారీ నిఘా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు ప్రారంభమయ్యాయని, శాంతిభద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ గురించి శిఖా గోయల్ వివరాలు తెలుపుతూ, సైబర్ నేరాల పట్ల తమది ‘జీరో టాలరెన్స్’ విధానమని స్పష్టం చేశారు. 2024-25 కాలంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,567 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయగా, వారిలో రాష్ట్రానికి చెందిన 614 మంది ప్రధాన నిందితులపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ తనిఖీల కోసం 300 బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయని, నిందితుల ప్రస్తుత నివాసం, వృత్తి, వారి ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నాయని వివరించారు. ప్రతి నిందితుడి నివాసాన్ని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా వారి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నామని, వారు బెయిల్ నిబంధనలను అతిక్రమించకుండా చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.అరెస్టయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు (269), ఏజెంట్లు (155), చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ (సి ఎస్ ఏ ఎం ) నిందితులు (36), సైబర్ స్లేవరీకి పాల్పడేవారు (8) వంటి వివిధ రకాల నేరగాళ్లు ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు 335 మందిని భౌతికంగా తనిఖీ చేయగా, వీరికి తెలంగాణలో 480 కేసులు, దేశవ్యాప్తంగా 1,233 కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 218 మంది ఆచూకీ లభించగా, 115 మంది పరారీలో ఉన్నారని, ముగ్గురు మరణించారని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎస్ఈఏఎం కేసులో నిందితుడైన ప్రసాద్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు గుర్తించామని, గతంలో అతడు సికింద్రాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో పని చేసేవాడని ఆమె వివరించారు.

ఒకసారి అరెస్టయిన తర్వాత కూడా నిందితులు పోలీసుల నిఘాలోనే ఉంటారని ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ ద్వారా తెలియజేస్తున్నామని శిఖా గోయల్ పునరుద్ఘాటించారు. ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడినట్లు తెలిస్తే లేదా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వారిపై వెంటనే ‘సస్పెక్ట్ షీట్లు’ తెరిచి, కఠిన నిఘా ఉంచుతామని హెచ్చరించారు. పౌరులను సైబర్ మోసాల నుండి రక్షించేందుకు తెలంగాణ పోలీసులు అన్ని దశల్లోనూ అప్రమత్తంగా ఉన్నారని డైరెక్టర్ శిఖ గోయల్ భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...
Translate »
error: Content is protected !!