హన్మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహాణకై 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు
సీ.సీ కెమెరాలు , డ్రోన్ కెమెరాలు , బైనాక్యులర్ లతో 24 / 7 పట్టిష్టమైన నిఘా ఏర్పాట్లు : పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిది లోని *ఈ నెల 02 న నిర్వహించే హనుమాన్ జయంతి , శోభాయాత్ర , అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్*., తెలియజేశారు.
ఇందుకోసం *నిజామాబాద్ , ఖమ్మం , రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి , ములుగు , మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది మరియు టి.ఎస్.ఎస్.పి బెటాలియన్ పోలీస్ సిబ్బంది , 20 స్పెషల్ పార్టీ లు బందోబస్తు నిర్వాహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడంజరుగుతుంది*. నిజామాబాద్ డివిజన్ పరిధిలలో హన్మాన్ శోభాయాత్ర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు దారి పోడువున “ *సి.సి కెమెరాలు , డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు బైనాక్యూలర్లతో పర్యవేక్షణ , కొత్తగా ఇంటర్సెప్టర్ వాహనము , పాత నేరస్తులపై నిఘా పటిష్ట పర్చడం జరిగింది*. అన్ని చోట్ల పటిష్టమైన నిఘా వ్వవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతీ ఓక్కరు అన్ని రకాల జాగ్రత్తలు వహించాలని , శోభాయాత్ర సందర్భంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని , శోభాయాత్ర ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహాకులు, భక్తులు యాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకుంటు పోలీసులకు సహాకరించాలని, శోభాయాత్రను అందరు శాంతియుతంగానే జరుపుకోవడం అందరికి శ్రేయస్సుకరమని, ఎలాంటి రూమర్లును నమ్మవద్దని, ప్రతిఒక్కరు స్నేహాభావంగా ఉండాలని తెలియజేశారు.

























