నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ప్రజలు తూ.చా తప్పనిసరి ఈ దిగువ నిబంధనలు పాటించగలరు
నిజామాబాదు నగర ప్రజలకు తెలియజేయునది ఏమనగా *తేది : 02-04-2026 నాడు ఉదయం నుండి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభ యాత్ర చేయడం జరుగును, ఇట్టి యాత్ర కాంటేశ్వర్ ఆలయం నుండి ప్రారంభం మై, ZP చౌరస్తా, హమాల్వాడి, పాత ప్రభాస్ టాకీస్, రైల్వే ఫ్లై ఓవర్ మీదుగా, గోదాం రోడ్, దేవి రోడ్, మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహురు పార్క్, అజాం రోడ్, పెద్దబజార్, లక్ష్మి మెడికల్ మరియు చివరిగా RR చౌరాస్తా వరకు చేరుకుంటుంది. శోభాయాత్రలో దేవత విగ్రహము మరియు పెద్ద సంఖ్య లో భక్తులు వచ్చి పాల్గొనే అవకాశం ఉన్నందున , ముఖ్యంగా గోదాం రోడ్ , దేవి రోడ్ , మమతా సర్కిల్ , గాంధీ చౌక్ , నెహురు పార్క్ , పెద్ద బజార్ లక్ష్మి మెడికల్ మరియు RR చౌరస్తా వరకు గల దుకాణ యజమానులు మరియు నివాసము ఉండే వారు తేదీ.01-04-2026 నాడు రాత్రి 8 గంటల నుండి తేది 02-04-2026 నాడు రాత్రి 11:30 గంటల వరకు* తమరి వాహనాలను శోభ యాత్ర వెళ్లే మార్గంలో రోడ్డు పైన పార్క్ చేయరాదు. మరియు ట్రాఫికి ఎలాంటి అంతరాయం కలిగించరాదని మా యొక్క విన్నపము.
*అలాగా క్రింద చూపిన ప్రాంతాల వాహనాలు అనగా*;-
*1) హైదరాబాద్ , ఆదిలాబాద్ , వరంగల్ వచ్చి పోయే RTC మరియు ప్రైవేటు బస్సులు* :- RTC బస్ స్టాండ్, ZP “T” రోడ్, సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, SFS School “T” రోడ్డు జంక్షన్ నుండి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, కాజా హోటల్ నుండి కంటేశ్వర్ బైపాస్ జంక్షన్ చేరుకొని హైదరాబాదు, అదిలాబాదు ,వరంగల్ వైపు వెళ్లాలి తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్ బస్టాండ్ చేరుకోవాలి.
*2) బోధన్ నుండి వచ్చిపోయే వాహనాలు* :- అర్సపల్లి రైల్వే గేట్ నుండి కొత్త కలెక్టరేట్, కాజా హోటల్ నుండి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, SFS School “T” రోడ్డు జంక్షన్ నుండి సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్ Z.P “T” జంక్షన్, NTR చౌరాస్తా, RTC బస్ స్టాండ్ చేరుకోవాలి.
*3) బాన్సువాడ నుండి వచ్చి పోయే వాహనాలు* :- వర్నీ చౌరాస్తా నుండి పులాంగ్ సర్కిల్, కోర్ట్ సర్కిల్, NTR చౌరస్తా, రైల్వే స్టేషన్ RTC బస్సు స్టాండ్ చేరుకోవాలి.
*కావున ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి తమరి యొక్క ప్రయాణాలు, జరుపుకొని, ట్రాఫిక్ పోలీస్ వారికీ సహాకరించాలని మా యొక్క మనవి*.

























