రేకులపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
శుక్రవారం : 03/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
రేకులపల్లి గ్రామం తాండాలో రూ.15 లక్షల ఎనర్జీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాజేందర్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ధర్పల్లి సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మంగ్య నాయక్, తాండ పెద్దలు విట్టల్, కారోబర్ పంతులు ఉన్నారు.

























